మంగళూరు: మతం మారుతుందేమోనన్న అనుమానంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉండేవాడని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, గతంలో అతడిపై గృహ హింస చేసినట్లు కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకొనే ముందు నిందితుడు పోలీసులకు ఓ వాయిస్ మెసేజ్ను పంపించాడు. ఓ మహిళ తన భార్య మతం మార్చేందుకు యత్నిస్తోందని, తమ చావుకు ఆమెనే కారణమని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.