కోల్కతా: పశ్చిమబెంగాల్లో మరోసారి ఎన్నికల హంగామా మొదలైంది. అసన్సోల్, చందానగర్, బిధానగర్, సిలిగురి మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అసన్సోల్, చందానగర్, బిధానగర్, సిలిగురి మున్సిపాలిటీలకు జనవరి 22న పోలింగ్ జరుగనున్నదని తెలిపింది. జనవరి 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఈసీ పేర్కొన్నది.
జనవరి 25న నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరుగుతుందని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సౌరవ్ దాస్ తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 వార్డులకుగాను 34 వార్డుల్లో తృణమూల్ జయకేతనం ఎగురవేసింది.