ఆగ్రా: తాజ్మహల్కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో ఆగ్రా ఫోర్టుకు సంబంధించి రూ.5 కోట్ల సేవా పన్ను చెల్లించాలంటూ ఆగ్రా కంటోన్మెంట్ బోర్డు కూడా నోటీసులు పంపింది. ఈ నోటీసులపై ఏఎస్ఐ స్పందిస్తూ పన్నులు, బిల్లుల నుంచి చారిత్రక కట్టడాలకు మినహాయింపు ఉన్నదని తెలిపింది.