ముంబై, ఆగస్టు 10: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఎన్ఐటీఐఈ) పేరు అతి త్వరలోనే ‘ఐఐఎం ముంబై’గా మారనున్నది. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు-2023’కు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పేరు మార్పునకు మార్గం సుగమమైంది. దీంతో దేశంలో 21వ ఐఐఎంగా ఐఐఎం ముంబై నిలువనున్నది.