Ayodhya | ముంబై: వచ్చే నెలలో అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని దేశ, విదేశాల్లో కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అటువంటివారిలో మహారాష్ట్రలోని ముంబైకి చెందిన షబ్నమ్ ఒకరు. ముస్లిం మతానికి చెందిన షబ్నమ్ శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసాలను ప్రదర్శిస్తున్నారు.
శ్రీరాముడిని పూజించడానికి హిందువుగా ఉండాల్సిన అవసరం లేదని, మంచి మనిషిగా ఉండటమే ముఖ్యమని గట్టిగా చెప్తున్నారు. కాషాయ జెండాను ధరించి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నారు. రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ఆమె 1,425 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు.