Mumbai | ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాన్ని మరోసారి పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై నగరంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిఘా పెంచారు.
ఇప్పటి వరకు మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపు కాల్స్ వస్తే.. తాజాగా ట్విట్టర్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఇలా సందేశం ఇచ్చారు. ముంబైని త్వరలోనే పేల్చేస్తానంటూ హెచ్చరించారు. ఈ మేసేజ్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్విట్టర్ అకౌంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.