కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్మీకి చెందిన రోబో డాగ్స్ (Robotic Dogs) ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ (మూలే)గా పేర్కొన్న రోబోటిక్ డాగ్కు సంజయ్ అని పేరుపెట్టారు. ఈ రోబో డాగ్స్ మెట్లతోపాటు కొండలను నిటారుగా ఎక్కగలవు. జీవ, రసాయన, అణు పదార్థాలను పసిగట్టే సెన్సార్లు కలిగి ఉన్నాయి. నిఘాతోపాటు బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం వంటి సేవల కోసం ఈ రోబో డాగ్స్ను ఆర్మీ వినియోగిస్తున్నది. 15 కిలోల బరువును ఇవి మోస్తాయి. అలాగే -40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్ర ఉష్ణోగ్రతల్లో కూడా ఇవి పని చేస్తాయి. ఆర్మీలోని వివిధ యూనిట్లలో సుమారు వంద వరకు రోబో డాగ్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, విపత్తు నిర్వహణ బృందాలు కవాతులో పాల్గొన్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
#WATCH | West Bengal CM Mamata Banerjee takes part in #RepublicDay2025 celebrations at Kolkata.
(Source: Mamata Banerjee Social Media) pic.twitter.com/1KUWOvFFvL
— ANI (@ANI) January 26, 2025