న్యూఢిల్లీ : సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నది. గత కొద్ది రోజులుగా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి ఆయన చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి, నిపుణులైన వైద్యుల బృందం పరిశీలిస్తున్నది. అయితే, ఆదివారం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని మేదాంత ఆసుపత్రి పేర్కొంది. మరో వైపు ములాయం కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా, ములాయం క్షేమంగా తిరిగి వస్తారని, ఆసుపత్రిలో ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కుటుంబీకులు సూచించారు. మరో వైపు కార్యకర్తలు, నాయకుల రద్దీ దృష్ట్యా ఆసుపత్రిలో భద్రతను పటిష్టం చేశారు. ఆసుపత్రిలో ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ఆసుపత్రిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు మూడేళ్లుగా ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఆగస్టు నుంచి ఆరోగ్యం క్షీణించింది. ములాయం ప్రొస్టేట్కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయన మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు.