కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్, ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్.. తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ముకుల్ రాయ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇతరుల మాదరిగా ముకుల్ రాయ్ దేశద్రోహి కాదని ఆమె నొక్కిచెప్పారు. 2017లో తృణమూల్ను వీడిన ముకుల్ రాయ్.. మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు.
సొంతగూటికి చేరుకున్న ముకుల్ రాయ్ తన పాత మిత్రులను చూసి సంతోషపడ్డారు. బీజేపీని వీడిన తర్వాత ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని పేర్కొన్నారు. మమత బెంగాల్కే కాదు ఇండియాకు కూడా లీడర్ అని చెప్పారు. సీఎం మమతతో తనకెలాంటి విబేధాలు లేవని ముకుల్ రాయ్ స్పష్టం చేశారు.