డెహ్రాడూన్: వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇవాళ బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించారు. ఇవాళ ఉదయం బద్రీనాథ్కు చేరుకున్న ముకేశ్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. బద్రీ కేదార్ ఆలయ కమిటీకి ఆయన 5 కోట్లు విరాళం ఇచ్చారు. బద్రీనాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిశోర్ పన్వర్.. రిలయన్స్ అధినేతకు స్వాగతం పలికారు. బద్రీనాథ్లో జరిగిన గీతా పాఠ్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్నారు.