MH vs KN : కర్నాటక- మహారాష్ట్ర మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలు అట్టుడుకుతున్నాయి. కర్నాటకలోపలికి మహారాష్ట్రకు చెందిన బస్సులను అనుమతించడం లేదు. దాంతో 145 మహారాష్ట్ర బస్సులు వెనక్కి వచ్చాయి అని ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గురువారం తెలిపింది. వీటిలో దాదాపు 7 వేల మంది యాత్రికులు ఉన్నారు. కర్నాటకలోని సౌందత్తి గుడిలో జరుగుతున్న వార్షిక వేడుకను చూసేందుకు మహారాష్ట్ర నుంచి వీళ్లంతా సోమవారం బయలుదేరాయి. అయితే వీళ్లు ప్రయాణిస్తున్న బస్సులను సరిహద్దు వద్ద కర్నాటక అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోకి అనుమతికపోవడంతో ఆ యాత్రికులు మహారాష్ట్రలోని కొల్హాపూర్కు రిటైన్ అయ్యారు.
ప్రతి ఏడాది డిసెంబర్లో సౌందత్తి గుడిలో ఎల్లమ్మ తల్లికి ఏటా వార్షికోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ వేడుకని చూసేందుకు మహారాష్ట్ర నుంచి చాలామంది వెళ్తారు. ఈసారి కూడా ఈ వేడుకని కళ్లారా చూసేందుకు మహారాష్ట్ర నుంచి భక్తులు బయలుదేరారు. కానీ, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా వాళ్లు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులను కర్నాటక లోపలికి అనుమతించలేదు. దాంతో, భక్తులు నిరాశగా తిరుగుముఖం పట్టారు. బెలగావిలోని హిరేబగెబడి టోల్ప్లాజా దగ్గర మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. దాంతో, కర్నాటకకు చెందిన 4 బస్సులను పూనేలో శివసేన, మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు ధ్వంసం చేశారు.