న్యూఢిల్లీ : భారత్కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్ డ్రామాగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభివర్ణించారు. రొటేషన్గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ హోదా దక్కిన దేశాలన్నీ జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టినందుకు డ్రామా సృష్టించలేదని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ బ్రిలియంట్ ఈవెంట్ మేనేజర్ అని వ్యాఖ్యానిచారు. గతంలో అమెరికా, బ్రిటన్, కెనడా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, మెక్సికో, రష్యా, ఆస్ట్రేలియా, టర్కీ, చైనా, జర్మనీ, అర్జెంటీనా, జపాన్, సౌదీ అరేబియా, ఇటలీ, ఇండోనేషియా వంటి దేశాలు జీ20 అధ్యక్ష హోదాను పొందాయని గుర్తుచేశారు.
ఈ ఏడాది భారత్ జీ20 అధ్యక్ష హోదాను పొందగానే బీజేపీ హంగామా చేస్తోందని దుయ్యబట్టారు. 2014లో ఎల్కే అద్వానీ గాంధీనగర్లో మోదీని బ్రిలియంట్ ఈవెంట్ మేనేజర్ అన్న విషయాన్ని తాను గుర్తుచేస్తున్నానని అన్నారు. జీ20 చుట్టూ ఇప్పుడు అదే జరుగుతోందని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.