న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడి లోక్సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని ఎంపీలు పట్టుకున్నారు. ఆపై అతడ్ని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. (MPs thrash Lok Sabha intruder) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుధవారం సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు దూకారు. ఒక వ్యక్తి సభ్యుల బెంచీల మీదుగా జంప్ చేశాడు. బెంచీలపై దూకి ముందుకెళ్తున్న అతడ్ని కొందరు ఎంపీలు అడ్డుకున్నారు. ఆగంతకుడ్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. చేతికి చిక్కిన ఆ వ్యక్తిని ఎంపీలు చితకబాదారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బెనివాల్, బీజేపీకి చెందిన మలుక్నాథ్, గురుప్రీత్ సింగ్ తదితర ఎంపీలు లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించేందుకు సహకరించారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి చొరబడిన వ్యక్తులను డీ మనోరంజన్, సాగర్ శర్మగా గుర్తించారు. సభ్యుల బెంచీలపై నుంచి సాగర్ దూకి వెళ్లగా, సభలో పసుపు రంగు పొగను మనోరంజన్ వెదజల్లాడు. అలాగే పార్లమెంట్ బయట కూడా పసుపు రంగు వెదజల్లి నిరసన తెలిపిన నీలం, అమోల్ షిండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన ఈ ఆరుగురు పార్లమెంట్లో హంగామా సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
दिलेरी और बहादुरी दौलत या पद से नहीं आती वो तो खून में होती है!! @hanumanbeniwal 😎⚠️#संसद#देश_का_सिपाही_हनुमान_बेनीवाल pic.twitter.com/pp6kwZBoQd
— Ranjeet Jajunda RLP (@Ranjeet_Jat_Rlp) December 13, 2023