ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే బుధవారం తెలిపారు. బారామతి ఎంపీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే (51)తో పాటు ఆమె భర్త సదానంద్ సూలేకు ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. కరోనా సోకినట్లు సుప్రియా సూలే ధ్రువీకరించారు. సదానంద్తో పాటు ఇద్దరికీ కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని, ఇద్దరికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. ఇటీవల తమను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు శరద్ పవార్, ప్రతిభా పవార్తో కలిసి దక్షిణ ముంబై నివాసంలో నివసిస్తున్నారు.