Pragya Singh | బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వార్తల్లోకెక్కారు. మద్యం ఓ మోతాదులో తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరిమితంగా సేవిస్తే మాత్రం విషం అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం ధర ఎక్కువ వున్నా, తక్కువ వున్నా.. అదో ఔషధం. ఆయుర్వేదంలో కూడా మద్యం గానీ, ఆల్కహాల్ గానీ పరిమితంగా వాడతారు. ఇది ఔషధంలా పనిచేస్తుంది. మోతాదుకు మించితే మాత్రం అది విషమే. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే నష్టాన్ని తెలుసుకొని, మద్యం సేవించడాన్ని మానేయాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని ప్రగ్యా సింగ్ డిమాండ్ చేశారు.