భోపాల్: ఆరెస్సెస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై శనివారం కేసు నమోదైంది. గోల్వాల్కర్పై ఫేస్బుక్లో దిగ్విజయ్సింగ్ ఓ పోస్టు పెట్టారు. దీనిపై ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దళితులు, ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చుపెట్టేందుకు దిగ్విజయ్సింగ్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని షేర్ చేసి విద్వేషం సృష్టించేందుకు దిగ్విజయ్సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మండిపడ్డారు.