ముంబై: స్వతంత్య్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు ఇవాళ ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఇద్దర్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నవనీత్తో పాటు ఆమె భర్తపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అమరావత్ నియోజకవర్గ ఎంపీ నవనీత్, బద్నేరా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రవి రాణాను ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేశారు.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఆచరించిన భావాలను సీఎం ఉద్దవ్ విస్మరించినట్లు ఎంపీ నవనీత్ ఆరోపించారు. ఇవాళ ప్రత్యేక జడ్జీ ఆర్ఎన్ రొకేడ్ బెయిల్ మంజూరీ చేస్తే, మరోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడవద్దు అని, మీడియాతోనూ ఈ అంశంపై మాట్లాడవద్దు అని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం లోగా ఆ ఇద్దరూ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.