గడ్డకట్టిన మౌంట్ అబూ.. మైనస్ 4 డగ్రీల ఉష్ణోగ్రత

మౌంట్ అబూ: దేశవ్యాప్తంగా చలి చంపేస్తున్నది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక రాజస్థాన్లోని మౌంట్ అబూలో మాత్రం చలి తీవ్రత విపరీతంగా ఉంది. అక్కడ బుధవారం రోజున మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో ఉండే వెదర్ లాంటి పరిస్థితులు మౌంట్ అబూలో దర్శనం ఇస్తున్నాయి. వరుసగా గత నాలుగు రోజుల నుంచి కనిష్ఠ స్థాయిలో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్లోని పర్వత శ్రేణుల్లో ఉన్న ఏకైన టూరిస్టు సెంటర్ మౌంట్ అబూ కావడం విశేషం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. కొందరు చలి మంటలు కాగుతున్నారు. ఇక టూరిస్టులు ఆ వెదర్ను ఎంజాయ్ చేస్తున్నారు. తెల్లవారేసరికి షిమ్లా తరహాలో కురుస్తున్న మంచుతో స్థానికులు మురిసిపోతున్నారు.
తాజావార్తలు
- యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ప్రతి గ్రామంలో బస్షెల్టర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
- సైకోను పట్టించిన సీసీ కెమెరా
- సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం
- వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం
- చిన్ని మెదడుకు పెద్ద కష్టం
- ‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్ పుణ్యమే
- మంద మెరిసె.. మది మురిసె
- డే1సక్సెస్
- మన శాస్త్రవేత్తల కృషితోనే వ్యాక్సిన్ : గుత్తా