చెన్నై: ఐఐటీ మద్రాస్ తాజా స్నాతకోత్సవంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన తల్లి, కొడుకు ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో డిగ్రీలను అందుకొన్నారు. జిగిశ టైలర్(45), ఆమె కొడుకు ఆదిత్య కపాడియా (21) ఆన్లైన్ డాటా సైన్స్ ప్రోగ్రాంలో ఈ కోర్సులను పూర్తి చేశారు. ప్రొఫెసర్లు, అతిథులు, కుటుంబాల సమక్షంలో ఒకే వేదికపై ఒకేసారి డిగ్రీలను అందుకోవడం జిగిశ కుటుంబానికి మధురానుభూతిని కలిగించింది.
ఇంజినీరింగ్ కాలేజీలో 16 ఏండ్ల పాటు ఎలక్ట్రానిక్స్ లెక్చరర్గా పనిచేసిన జిగిశ కుటుంబ బాధ్యతల కారణంగా 2019లో ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే కొడుకు ఆదిత్య ప్రోత్సాహంతో ఆమె ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందారు.