బెంగళూరు: మైసూరులో మసీదును పోలిన బస్స్టాప్ను నిర్మించడంతో రాజుకున్న వివాదం సమసిపోయింది. స్థానిక ఎంపీ హెచ్చరికతో బస్టాండ్ రూపు మారిపోయింది. మైసూరు-ఊటీ రోడ్డులోని ఆ బస్టాండులో ముందుగా మూడు డోమ్స్ ఉండేవి. మధ్యలో డోమ్ పెద్దగా, దానికి అటుఅటు రెండు డోమ్లు చిన్నగా ఉండి, మూడింటికి బంగారు రంగు పూత ఉండేది. ఇప్పుడు ఆ మూడు డోమ్ల స్థానంలో మధ్యలోని పెద్ద డోమ్ను మాత్రమే ఉంచారు. రెండు వైపులా చిన్న డోమ్లను తొలగించి ఎరుపు రంగు వేశారు.
ముందుగా మైసూర్ ప్యాలెస్ స్ఫూర్తితో స్థానిక ఎమ్మెల్యే ఆ బస్టాండ్ను కట్టించారు. అయితే, ఆ బస్టాండ్ను మసీదును పోలీ ఉన్నదని, దాన్ని తక్షణమే కూల్చివేయకపోతే తానే జేసీబీ తీసుకొచ్చి కూల్చేస్తానని ఆయన హెచ్చరించారు. దాంతో ఎమ్మెల్యే ఆ బస్టాండ్కు మార్పులు చేయించారు. తాను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే క్షమించాలని ప్రజలను కోరారు.
కాగా, బస్టాండ్కు మార్పులు చేయించడంపై ఎంపీ కూడా హర్షం వ్యక్తంచేశారు. తన ఆందోళనతో ఏకభవించి బస్టాండ్లో మార్పులు చేయించిన ఎమ్మెల్యేకు, స్థానిక అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.