Microsoft Global Outage : మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్పై కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహల్ స్పందించారు. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు డౌన్ కావడంతో గ్లోబల్ అవుటేజ్ నెలకొందని వివరించారు.
భారత్లో ఈ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్పోర్టుల్లోని గ్రౌండ్ ఆపరేషన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA), పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నాయని మంత్రి తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్తో నడిచే కంప్యూటర్లు, లాప్టాప్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో పలు సేవలు నిలిచిపోయాయి.
భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో భారత్లో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఇండిగో, స్పైస్జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
Read More :
Bangladesh violence | బంగ్లాదేశ్లో చెలరేగిన హింస.. 39 మంది మృతి, వేల మందికి గాయాలు