న్యూఢిల్లీ, మే 6: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, జార్ఖండ్ సీఎంలు, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లతో బుధవారం వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. కరోనా కట్టడి చర్యలను సమీక్షించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 10 రాష్ర్టాల జాబితాలో ఏపీ కూడా ఉన్నది. ఏపీలో గురువారం 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.