పూంచ్: జమ్మూకశ్మీర్లోని పూంచ్లో ఆర్మీ వాహనంపై దాడి జరిగిన ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి నేపథ్యంలో పూంచ్ సెక్టార్(Poonch Sector)లో భారీగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కోసం మరింత మంది భద్రతా బలగాల్ని రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భాటా దురియాన్ టోటా గాలి ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నడుస్తోంది. నాలుగో రోజు సెర్చ్ కొనసాగుతుండడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్భంధం చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.