న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. గత నెలరోజుల్లో 15-18 సంవత్సరాల వయసున్న 2కోట్ల మంది టీనేజర్లకు రెండుడోసుల టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి కొవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే థర్డ్వేవ్ నేపథ్యంలో ప్రికాషనరీ డోస్ సైతం వేసింది.
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్ టీకాలు తీసుకుంటున్నారని ఆరోగ్యమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా.. దేశంలో కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,920 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 492 మంది మరణించగా.. 66,254 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 1,74,64,99,461 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.