Suicides | కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతున్న వేళ 2020లో రైతుల కంటే ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంగతిని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2020లో ప్రమాదవశాత్తు, ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారులు 11,716 మంది. ఇదే కారణంతో 2019లో మరణించిన వారు 9,052 మంది వ్యాపారులు. అంటే గతేడాది 29 శాతం మంది వ్యాపారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నమాట.
గతేడాది 10,677 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యాపారులతో పోలిస్తే రైతుల సంఖ్య 1039 మంది. 2014-19 వరకు ఏయేటికాయేడు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఎన్సీఆర్బీ తెలిపింది. 2017లో 7,800 మంది వ్యాపారులు బలవన్మరణానికి పాల్పడితే, 2019లో 9,000 దాటింది.
2017లో సుమారు 10,700 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే, 2018, 2019ల్లో 10,300 మందికిపైగా, 2020లో 10,700 మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. బలవన్మరణానికి పాల్పడ్డ వ్యాపారుల్లో 93 శాతం మంది పురుషులు. వెండర్లు 36, ట్రేడ్స్మెన్ 37 శాతం మంది.. వీరిలో చాలా మంది అభివృద్ధి చెందిన రాష్ట్రాల వారే.