బెంగళూరు, ఫిబ్రవరి 26: కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతున్నది. ఈ వ్యాధితో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ (60) మంకీ ఫీవర్తో 20 రోజులపాటు పోరాడి, ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. సిద్ధాపూర్ తాలూకా, కూర్లకై గ్రామానికి చెందిన ఈ మహిళకు శివమొగ్గలోని ఓ దవాఖానలో మూడు రోజులపాటు చికిత్స చేశారు.
ఆమె ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి కారణంగా మరణించినవారి సంఖ్య నాలుగుకు పెరిగింది. సిద్ధాపూర్ తాలూకాలో మంకీ ఫీవర్ కేసులు 43 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 103 మంది ఈ వ్యాధి బాధితులు ఉన్నారు.