న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు కేంద్ర విద్యా శాఖ అవకాశం కల్పించింది. గుజరాత్లోని వాద్ నగర్ టౌన్లో ఉన్న ఈ పాఠశాలకు ఏడు రోజుల స్టడీ టూర్కు వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు ఓ పోర్టల్ను ప్రారంభించింది.