(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసింది. నర్మదా జిల్లాలోని అహ్మదాబాద్, కెవడియా మధ్య 2020 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ‘సీ-ప్లేన్’ సర్వీసులను ఆరంభించింది.
ఈ కార్యక్రమానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే, ప్లేన్ నిర్వహణను ఇతరత్రా కారణాలను చూపుతూ ఒక్క రోజు గడవకుండానే ఆ సర్వీసులను మూలన పడేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత ఒకరు అడిగిన ప్రశ్నకు ఇటీవల గుజరాత్ ప్రభుత్వమే ఈ మేరకు సమాధానమిచ్చింది. ఉప ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ప్రభుత్వం ‘సీ-ప్లేన్’ గిమ్మిక్ ప్రదర్శించిందని విపక్షాలు మండిపడుతున్నాయి.