Modi & Xi Jinping | ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో వచ్చే నెలలో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా చైనా, రష్యా అధ్యక్షులు జీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం అవుతారని వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. సెప్టెంబర్ 15-16ల్లో సమర్కండ్లో ఎస్సీవో సదస్సు జరుగనున్నది. ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలు పాల్గొంటారా.. లేదా.. అన్న విషయమై భారత్, చైనా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్రమోదీ పలు అంతర్జాతీయ సదస్సులు, ద్వైపాక్షిక సంబంధాల కోసం పలు దేశాల్లో పర్యటించారు. కానీ, 2020 జనవరి నుంచి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇప్పటి వరకు విదేశీ పర్యటన చేయలేదు. ఒకవేళ, ఎస్సీవో సదస్సుకు హాజరు కాకపోయినా వర్చువల్ వేదికగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తైవాన్ అంశంపై అమెరికా – చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సదస్సుకు హాజరవుతారని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్లో మానవ హక్కులు, భద్రతా తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని సమాచారం. ఒకవేళ సభ్య దేశాల అధినేతలు హాజరైతే, అందరితోనూ విడివిడిగా ప్రధాని నరేంద్రమోదీ భేటీ అవుతారని తెలుస్తున్నది. పాక్ ప్రధాని షానవాజ్ షరీఫ్ కూడా హాజరవుతారని అంతా బావిస్తున్నారు.