రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొగ్గి తన మేనల్లుడికి (అభిషేక్ బెనర్జీకి) అత్తగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. టీఎంసీ పాలనలో లోక్తంత్రాను (ప్రజాస్వామ్యాన్ని).. లూట్తంత్రా (దోపిడీ రాజ్యం) ఆక్రమించింది. బంగారు బెంగాల్ను మేము నిర్మిస్తాం
-పశ్చిమబెంగాల్లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ
గత కొన్నేండ్లుగా అబద్ధపు వాగ్ధానాలు చేస్తూ ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన అసత్యపు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. 2014 లోక్సభ ఎన్నికల ముందు.. ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను జమ చేస్తానని ఆయన అన్నారు. ఆ సొమ్ము ఎక్కడ? అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న మోదీ ఇందుకు సిగ్గుపడాలి. ధరలను పెంచుతూ సామాన్యులకు ఎల్పీజీని అందుబాటులో లేకుండా చేశారు. మోదీ, అమిత్ షా పెద్ద దోపిడీదార్లు.
-ఎల్పీజీ ధరల పెరుగుదలను నిరసిస్తూ సిలిగురిలో నిర్వహించిన పాదయాత్రలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ