న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేపిస్టులకు ప్రధాని మోదీ అండగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బిల్కిస్ బానో రేపిస్టుల రిలీజ్ విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం తొందరపడినట్లు తాజాగా ఓ నివేదిక రిలీజైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్పై రాహుల్ స్పందించారు. మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోటలో ప్రసంగించారని, కానీ వాస్తవంలో ఆయన రేపిస్టులకు సానుకూలంగా ఉన్నారని రాహుల్ తన ట్వీట్లో ఆరోపించారు. ప్రధాని చేసిన ప్రామిస్, ఆయన ఉద్దేశం మధ్య తేడా ఉందని రాహుల్ అన్నారు. మహిళలను మోదీ మోసం చేశారని రాహుల్ విమర్శించారు.
लाल किले से महिला सम्मान की बात लेकिन असलियत में 'बलात्कारियों' का साथ।
प्रधानमंत्री के वादे और इरादे में अंतर साफ है, PM ने महिलाओं के साथ सिर्फ छल किया है।
— Rahul Gandhi (@RahulGandhi) October 18, 2022
బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులైన 11 మందిని కొన్ని నెలల క్రితం రిలీజ్ చేశారు. ఆ సమయంలో వాళ్లను గౌరవించారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. నిందితుల్ని రిలీజ్ చేయవద్దు అని సీబీఐ తన నివేదికలో చెప్పినా.. కేంద్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.