దుబాయ్: దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్ 18లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే వాతావరణ సదస్సు కాప్33కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించే గ్రీన్ క్రెడిట్ ఇనీషియేటివ్ను ప్రస్తావించారు. కాప్18 సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం పాటించడంలో ప్రపంచ దేశాలకు భారత్ గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు.