న్యూఢిల్లీ : కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్గడ్కరీ, సదానంద గౌడ, మురళీధరన్తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరైనట్టు తెలిసింది. వారంరోజులుగా ప్రధాని కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటం తెలిసిందే. తాజా భేటీ ఐదోది. రెండోసారి అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేబినెట్ విస్తరణ, మార్పులు చేర్పులపైనా ఈ భేటీలో చర్చించి ఉండొచ్చని సమాచారం. మరోవైపు, దేశంలో క్షయీకరణం చెందుతున్న 2.6 కోట్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు మోదీ తెలిపారు. 2030 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ప్రసంగించారు.