ముంబై, మే 8: ప్రధాని మోదీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు చేశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో మోదీ ‘ప్రేమ’లో ఉన్నారని, ఆయన్ను ఓ ఫాలోవర్గా అనుసరిస్తున్నారని అన్నారు. ఆదివారం పార్టీ సమావేశంలో పాల్గొన్న రౌత్ మాట్లాడుతూ హిట్లర్ ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరించాడో.. మోదీతో పాటు ఆయన పార్టీ బీజేపీ కూడా అదేవిధంగా ప్రవర్తిసున్నదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘ప్రస్తుతం దేశంలో ఎవరైనా హిట్లర్ను పొగిడితే, అది దేశద్రోహం కాబోదు’ అని రౌత్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాపులర్ నేతగా వెలుగొందిన డిక్టేటర్ హిట్లర్ కూడా ఆఖరుకు ఓడిపోయారని అన్నారు.