Boeing : బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూర్లో శుక్రవారం ప్రారంభించారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా హాజరైన ఈ కార్యక్రమంలో జనం మోదీ నినాదాలతో హోరెత్తించడంతో ప్రధాని రియాక్టయ్యారు. ముఖ్యమంత్రి జీ ఇలా జరుగుతుంటుందని వ్యాఖ్యానించారు.
దేశంలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా భారత విమానయాన సంస్ధలు వందలాది విమానాలకు ఆర్డర్లు ఇస్తున్నాయని, భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీ ఏవియేషన్ మార్కెట్గా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఏవియేషన్ మార్కెట్కు భారత్ సరికొత్త ఊపునిస్తోందని అన్నారు. మన దేశంలోని పైలట్లలో 15 శాతం మంది మహిళలేనని, ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు అధికమని చెప్పారు.
మహిళ కేంద్రంగా అభివృద్ధి చోటుచేసుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాగా, బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ను 43 ఎకరాల విస్తీర్ణంలో రూ 1600 కోట్ల వ్యయంతో నిర్మించారు. అమెరికా వెలుపల విమాన తయారీ దిగ్గజం పెట్టిన ఈతరహా భారీ పెట్టుబడి ఇదేనని బోయింగ్ పేర్కొంది.
Read More :
Inspiration | దేశంలో తొలి మహిళా హెయిర్ డ్రెస్సర్ ఈమెనే.. ప్రశంసించిన ప్రధాని