న్యూఢిల్లీ: లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం మార్క్ను బ్రేక్ చేయాలన్నారు. కోటా గోడను దాటేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోందని అసద్ అన్నారు. జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా.. తోడ్ జాయియే 50 పర్సత్కో అంటూ ఎంపీ అసద్ కామెంట్ చేశారు. ఓబీసీలతో మీకు ప్రేమ లేదని, వారి ఓట్లతో మీకు ప్రేమ ఉందని విమర్శించారు. ఓ బిల్లుతో సుప్రీం తీర్పును నొక్కిపెట్టినప్పుడు, ఇక షా బాను కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కొందరు ఓబీసీలకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ముస్లింలను విస్మరిస్తోందన్నారు.
ప్రో యాక్టివ్ రీతిలో మోదీ సర్కర్ 50 పర్సెంట్ సీలింగ్ను బ్రేక్ చేయాలన్నారు. ఇదో అద్భుత అవకాశమని, ఓబీసీ సమాజానికి న్యాయం చేయాలని అసద్ కోరారు. సభలో కేవలం మరాఠాల గురించే మాట్లాడుతారా.. మహారాష్ట్రలోని ముస్లింల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఇఫ్తార్ల దావత్ తప్ప ముస్లింలకు రిజర్వేషన్లు దొరకవా అని ఎంపీ అసద్ అడిగారు. 89 మంది సెక్రటరీల్లో.. ఎంత మంది ఓబీసీలు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.