తిరువనంతపురం: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అధ్యాయాలను తొలగించడాన్ని కేరళ సీఎం విజయన్ తీవ్రంగా ఖండించారు. పాఠ్యపుస్తకాలను పూర్తిగా కాషాయీకరించాలన్న ఎజెండాలో భాగంగానే ఈ పని చేశారని దుయ్యబట్టారు.
కొంత మందికి అసౌకర్యంగా ఉన్న భాగాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినంత మాత్రాన చారిత్రక వాస్తవాలను ఎవరూ కాదనలేరని ఫేస్బుక్ పోస్టులో స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని భాగాలను తొలగించడం చరిత్రను తిరస్కరించడమే అవుతుందన్నారు.