పాట్నా, సెప్టెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను రాజకీయంగా వేధిస్తున్నదని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆరోపించారు. బీహార్కు హక్కుగా రావాల్సిన నిధులను సాధించుకొనేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తున్నదని ఆయన మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు.
‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పథకాల పేరుతో రాజకీయం చేస్తున్నది. బీహార్లో మౌలిక వసతులు, విద్య, సాంఘిక సంక్షేమానికి సంబంధించిన పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులను ఆపేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షా అభియాన్ పథకానికి ఇప్పటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు’ అని ఆరోపించారు.