న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ సర్కార్ మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని ఇలా పొడిగించటం ఇది మూడోసారి. ఈ మేరకు వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర వేసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.