ముంబై, ఆగస్టు 29: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందని అన్నారు.
సోమవారం ఠాణెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, ఒక్కటీ నెరవేర్చలేదు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. కానీ, అమలులో ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.