కాశీ: ప్రధాని మోదీ ఇవాళ కాశీలో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ ఉదయం కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాత.. కిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకు క్రూయిజ్లో వెళ్లారు. డబుల్ డక్కర్ అలకనంద క్రూయిజ్లో మోదీ విహరించారు. కాశీలోని గంగా నది వెంట జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మోక్ష నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు.