ముంబై : మహారాష్ట్రలో శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఎన్సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కుల విద్వేషం పెచ్చుమీరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 ఏండ్లుగా ఎన్సీపీ రాకతో రాష్ట్రంలో కుల విద్వేష రాజకీయాలను ప్రజలు బహిరంగంగా చర్చించే పరిస్ధితి నెలకొందని మహారాష్ట్రను యూపీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.
ఎన్సీపీ ఉనికిలోకి వచ్చిన తర్వాతే ఈ దుస్ధితి తలెత్తిందని ప్రతిఒక్కరికీ తెలుసని, కానీ దీనిపై తానే మొదటగా ప్రశ్నించానని పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఠాక్రే పేర్కొన్నారు. మరోవైపు రాజ్ ఠాక్రే విమర్శలపై పవార్ స్పందిస్తూ మొదట ఆయన చరిత్ర చదవాలని హితవు పలికారు. ముందుగా ఆయన తన తాత ప్రబోధంకర్ ఠాక్రే రాసిన పుస్తకాలని చదవాలని సూచించారు.