ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన తల్లి కుందా ఠాక్రే, సోదరికి కరోనా సోకింది. కొవిడ్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని బీఎంసీ అధికారి తెలిపారు. కాగా, రాజ్ ఠాక్రే, ఆయన సోదరి లీలావతి ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. వారికి తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని చెప్పారు.
53 ఏండ్ల రాజ్ ఠాక్రే వచ్చే ఏడాది జరుగనున్న స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబైలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నాసిక్, పూణే, థానేలో ఇటీవల ఆయన పర్యటించారు. స్థానిక ఎన్నికల గురించి పార్టీ నేతలతో చర్చలు జరిపారు.