పనాజీ: గోవాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కో ఎమ్మెల్యే అధికార పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్యేలు కాషాయ పార్టీని వీడగా, మరో ఎమ్మెల్యే విల్ఫ్రెడ్ సా (Wilfred D’Sa) కమల దళానికి గుడ్బై చెప్పారు. గత ఎన్నికల్లో నువెమ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అనంతరం 2019లో మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు.
అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో క్యాథలిక్కులు అధికంగా ఉంటారని, అక్కడ బీజేపీకి ఓట్లు పడే అవకాశం లేదని విల్ఫ్రెడ్ అన్నారు. అందుకే తాను బీజేపీని వీడుతున్నానని, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. బీజేపీలో చేరినప్పుడే తాను మళ్లీ ఆ పార్టీ టెకెట్పై పోటీ చేయనని వారికి చెప్పానని తెలిపారు.
గోవాలో ఫబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ నేతృత్వంలో పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నది.