చెన్నై : సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలని అవినీతికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించాలని డీఎంకే శ్రేణులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) పిలుపు ఇచ్చారు. సనాతన ధర్మాన్ని సమర్ధిస్తూ ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్ సహచరులకు చెప్పడం ఈ వివాదం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే కాషాయ పార్టీ ఉద్దేశాలను వెల్లడిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు.
సనాతన ధర్మం చర్చలో ఉండేందుకు ఓ కేంద్ర మంత్రి ప్రతిరోజూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని డీఎంకే చీఫ్ ఆరోపించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాల్పడే వ్యూహాల్లో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. అవినీతిపై చర్చ జరగడాన్ని నిరోధించేందుకు సనాతన ధర్మంపై బీజేపీ దృష్టి సారిస్తోందని ద్రవిడార్ కజగం చీఫ్ కే. వీరమణి వ్యాఖ్యానించారని స్టాలిన్ గుర్తుచేశారు.
బీజేపీ అవినీతిపై మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలని వీరమణి సూచించారని చెప్పారు. కాషాయ సర్కార్ అవినీతిపైనే ప్రధానంగా దృష్టిసారించాలని కాంగ్రెస్, వామపక్షాలు సహా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అవినీతి, మతోన్మాద బీజేపీ సర్కార్ను మట్టికరిపించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనందరం పనిచేయాలని, మన దృష్టి మరల్చే శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వరాదని తాను కోరుతున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన వాస్తవ అంశాలను మరుగుపరిచి, ఇతర అంశాలపై దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తారనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.
Read More :
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం పట్టివేత