Mizoram | న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా మిజోరంలోనూ డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తమ రాష్ట్రంలో ఆదివారం రోజు కాకుండా, ఇతర రోజుల్లో ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్థానిక ప్రజల నుంచి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. దీంతో మిజోరం రాష్ట్ర ప్రజల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని 3వ తేదీకి బదులుగా, 4వ తేదీన లెక్కించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 3వ తేదీనే జరగనుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మిజోరం రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 9న ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే.