భోపాల్: చీతాలతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నాయి. ఇక్కడి వాతావరణంలో అవి మనుగడ సాగించలేవని తెలిసినా మంకుపట్టుతో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. దీంతో ఇప్పటికే చాలా చీతాలు మరణించాయి. తాజాగా ఓ ఆడ చీతా తప్పిపోవడం కలకలం సృష్టించింది.
అది ఎక్కడ ఉన్నదో.. ఎలా ఉన్నదో అన్న విషయం ఇప్పటికీ తెలియలేదు. చీతా కదలికలను తెలుసుకునేందుకు అమర్చిన రేడియో కాలర్ దెబ్బతిన్నది. దీంతో దాని జాడను తెలుసుకోవడం కష్టంగా మారింది. అధికారులు స్పందిస్తూ చీతా కోసం గాలింపు కొనసాగుతూనే ఉన్నదని చెప్పారు.