న్యూఢిల్లీ: కోటి డబ్బులు ఇవ్వాలని ప్రాపర్టీ డీలర్ను కొందరు దుండగులు బెదిరించారు. ఆ కార్యాలయంపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. (Miscreants Fire) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ద్వారకా ప్రాంతంలోని ఓ ప్రాపర్టీ డీలర్ను గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌ బెదిరించాడు. కోటి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో బుధవారం తన గ్యాంగ్ సభ్యులను ప్రాపర్టీ డీలర్ కార్యాలయం వద్దకు పంపాడు. వారు 20 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజ్ను పరిశీలించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటన వెనుక గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌ హస్తం ఉందన్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Minors fire at businessman's house in Delhi's Burari area to demand a ransom amount, both were held from Haryana's Sonipat. #CCTV #CCTVFootage #Delhi #ViralVideo pic.twitter.com/zoKC5R8EUU
— Vani Mehrotra (@vani_mehrotra) December 13, 2023