లక్నో: ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు. అయితే ఈసారి నిందితులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఓ దుండగుడికి (Miscreant) గాయాలవగా, మరో నలుగురు పట్టుబడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెయిన్పురీ (Mainpuri) ప్రాంతంలోని కురావలి టౌన్లో (Kurawali town) పోలీసులు, గుర్తుతెలియని వ్యక్తులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో నలుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు తప్పించుకున్నారని మెయిన్పురి ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
ఘటనా స్థలంలో రెండు మోటారు సైకిళ్లు, అక్రమాయుధాలు, కాట్రిడ్జ్లు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించామన్నారు. నిందితులను మహమ్మద్ హుస్సెయిన్, జానీ అలియాస్ రిషభ్, కలామ్, అభయ్గా గుర్తించామని, విచారణ సందర్భంగా ఇర్ఫాన్, ఆశిష్ అనే వ్యక్తులు తప్పించుకున్నారని చెప్పారు.
They told during interrogation that two miscreants namely Irfan and Ashish fled from the spot. The injured accused has been admitted to the hospital. 2 motorcycles, illegal arms, cartridges and some jewellery were recovered: Vinod Kumar, SP, Mainpuri (11.03) pic.twitter.com/dOaUK2gf89
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 11, 2023
బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ను గత నెల 24న సాయంత్రం ప్రయాగ్రాజ్లో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ఇప్పటికే ఇటీవల ఒక నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో షార్ప్ షూటర్ అయిన మరో నిందితుడిని అంతం చేశారు.
కాగా, ఉమేశ్ పాల్ గత నెల 24న తన బాడీగార్డ్స్తో కలిసి ఇంటివద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ కాపుగాసి ఉన్న దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉమేశ్ పాల్ ప్రాణాలు కోల్పోయాడు. అంతేగాక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అంగరక్షకులు కూడా చికిత్స పొందుతూ ఆ తర్వాత మరణించారు. ఈ హత్యల వెనుక మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి.