పార్టీని వీడిన మంత్రి, ఎమ్మెల్యే
పనాజీ: త్వరలో ఎన్నికలు జరుగనున్న గోవాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. మంత్రి మైఖెల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్ జాంత్యే పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వీరు కాంగ్రెస్లో చేరుతారని సమాచారం. బీజేపీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని లోబో పేర్కొన్నారు. కాషాయ పార్టీ సామాన్యుల పక్షాన లేదని ఓటర్లు తనతో చెప్పారన్నారు. గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగనున్నాయి.